తూచ్.. తిరుమల కంటైన్మెంట్ జోన్ కాదు

తిరుమలలో కరోనా కేసులు పెరుగుతుండటంతో జిల్లా ఉన్నతాధికారులు తిరుమలను కంటైన్మైంట్ జోన్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారో లేదో అని భక్తులలో ఆందోళన నెలకొంది. అయితే, భక్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. తిరుమలను పొరపాటున కరోనా కంటైన్మైంట్ జోన్ గా ప్రకటించామని జిల్లా కలెక్టర్ తెలిపారు. తాజా ప్రకటనతో భక్తుల దర్శనాలకు ఆటంకం తొలగిపోయింది. భక్తులు ఎలాంటి ఆందోళన లేకుండా స్వామిని దర్శించుకోవచ్చని టీటీడీ ప్రకటించింది.