చంద్రబాబుతో ముగ్గురు ఎంపీలు భేటీ!!

 

ఒకవైపు పలువురు టీడీపీ నేతలు పార్టీని వీడబోతున్నారని వార్తలొస్తున్న నేపథ్యంలో.. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడం ఆసక్తి కలిగిస్తోంది. చంద్రబాబుతో ఆ పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు ఈరోజు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన ముగ్గురు ఎంపీలు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ విషయమై రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ.. తాను టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు గల్లా జయదేవ్, కేశినేని నానితో భేటీ అయ్యానని తెలిపారు. తమ సమావేశం సహృద్భావ వాతావరణంలో సాగిందని చెప్పారు. కాగా, టీడీపీ నేత బుద్ధా వెంకన్నతో కేశినేని ట్విట్టర్ వార్ పై కూడా ఈ భేటీలో చంద్రబాబు ప్రశ్నించినట్లు సమాచారం.