సీఎం కేసీఆర్‌ సంతకం ఫోర్జరీ.. ముగ్గురు అరెస్ట్

 

ఏకంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతకాన్నే ఫోర్జరీ చేసిన కేటుగాళ్ల బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. సీఎం సంతకంతో నకిలీ పత్రాలు సృష్టించిన వారిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలోని 44/p సర్వీ నెంబర్ లో ఉన్న 2 ఎకరాల భూమిని కొనుగోలు చేయడానికి కేసీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ సిఫార్సు లెటర్ ను తయారు చేశారు. లెటర్‌ హెడ్‌ను యాకుత్‌పురా టీఆర్‌ఎస్‌ నేత నుంచి రూ.45 వేలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కాగా కేసీఆర్ సంతకంపై అనుమానం వచ్చి రాజేంద్రనగర్ ఆర్డీవో ఆరా తీయగా నకిలీదని తేలింది. ఆర్డీవో ఫిర్యాదుతో.. ప్రధాన నిందితుడు మహ్మద్ ఉస్మాన్ తో పాటు మరో ఇద్దరిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.