Top Stories

అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు.. జగన్ తీరిక మారదా?

అందితే జుట్టు లేకుంటే కాళ్లు పట్టుకునే మనస్థత్వం మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిది. ఈ విష‌యం చాలాసార్లు రుజువైంది. తాజాగా మ‌రోసారి జ‌గ‌న్ అదే ఫార్ములాను అమ‌లు చేయ‌బోతున్నారు. ప్ర‌తిప‌క్ష హోదా ఇచ్చేవ‌ర‌కు అసెంబ్లీకి వెళ్ల‌నంటూ ఇన్నాళ్లు మొండిప‌ట్టు ప‌ట్టిన జ‌గ‌న్‌.. తన అసెంబ్లీ సభ్యత్వంపైనే అన‌ర్హ‌త వేటు పడే పరిస్థితి వచ్చే సరికి యూటర్న్ తీసుకోవడానికి రెడీ అయిపోయారు. అనర్హత వేటు పడితే పులివెందుల నియోజకవర్గం నుంచి మరో సారి గెలుస్తానన్న నమ్మకం జగన్ లో లేకపోవడం వల్లనే ఆయన అసెంబ్లీకి హాజరై ఆ వేటు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. జగన్ సిల్లీ ప్లాన్ చూసి వైసీపీ నేతలు సైతం చీదరించుకుంటున్న పరిస్థితి. వాస్త‌వానికి.. పార్టీలోని ముఖ్య‌నేత‌ల‌ను సైతం జ‌గ‌న్ రాజ‌కీయ అవ‌స‌రానికి వాడుకొని త‌రువాత ప‌క్క‌న‌పెట్టేసిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. ఈ క్ర‌మంలో వైసీపీకి వీరాభిమానులం, రాజ‌కీయాల్లో ఉన్నంత‌కాలం వైసీపీలోనే ఉంటాం అంటూ దీమాగా చెప్పిన‌ వారు సైతం..   ఆ పార్టీని వీడుతున్నారంటే.. ఆయన యూజ్ అండ్ త్రో పాలసీ అర్ధమౌతుంది.   మ‌రోవైపు.. త‌నపై తానే దాడులు చేయించుకొని ప్ర‌జ‌ల్లో సానుభూతి పొంద‌డంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మించిన రాజ‌కీయ నేత దేశ రాజ‌కీయాల్లో ఎక్క‌డా క‌నిపించ‌రు.  బాబాయ్ హ‌త్య‌, కోడిక‌త్తి డ్రామాతోపాటు ఒక్క ఛాన్స్ ఫ్లీజ్ అంటూ 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్‌.. ఐదేళ్లు ఏపీ ప్ర‌జ‌ల‌కు న‌ర‌కం చూపించారు. వైసీపీ హ‌యాంలో పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల ప్ర‌జ‌లు ప‌నుల‌ కోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వ‌ల‌స వెళ్లిన ప‌రిస్థితి. దీంతో 2024 ఎన్నిక‌ల్లో ఏపీలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఏక‌మై జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేత‌ల‌కు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. ఫ‌లితంగా కేవ‌లం 11 సీట్ల‌లో మాత్ర‌మే వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. అంటే..  ఏపీ ప్ర‌జ‌లు క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదాకు స‌రిప‌డా అసెంబ్లీ స్థానాల‌ను సైతం వైసీపీ పార్టీకి ఇవ్వ‌లేదు. కానీ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం తనకు ప్రతిపక్ష నేత హోదా, తన పార్టీకి ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వాలంటూ అధికార పార్టీని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ వ‌స్తాన‌ని హఠం చేస్తున్నారు. ప్ర‌జ‌లే ఇవ్వ‌ని ప్ర‌తిప‌క్ష హోదాను జ‌గ‌న్, వైసీపీ నేత‌లు కోరుకుంటుండటం ప్ర‌జాతీర్పుపై వారికి ఎంత గౌర‌వం ఉందో తేట‌తెల్లం చేస్తుంది.  ఇటీవ‌ల.. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న‌ప్ప‌టికీ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి నానా ర‌భ‌స చేసిన జ‌గ‌న్‌.. ప్ర‌తిప‌క్ష నేత వ‌చ్చినా స‌రియైన భ‌ద్ర‌త ఇవ్వ‌రా అంటూ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించి తానో రాజకీయ జోకర్ గా నిరూపించుకున్నారు.   కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అసెంబ్లీ వ‌చ్చారు. ఆ త‌రువాత జ‌గ‌న్‌, మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎవ‌రూ అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రుకాలేదు. ప‌లుసార్లు స‌మావేశాల‌కు హాజ‌రుకావాల‌ని స్పీక‌ర్‌, డిప్యూటీ స్పీక‌ర్ కోరిన‌ప్ప‌టికీ.. వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తేనే వ‌స్తామంటూ జ‌గ‌న్ వాదిస్తూ వ‌స్తున్నారు. అసెంబ్లీకి హాజరుకాని జగన్మోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రెడీ అయ్యారు. అయితే, చేతనైంది చేసుకోండి అని జగన్ రెడ్డి కూడా ఇటీవల మీడియా స‌మావేశంలో అన్నారు . అయితే ఆయనదంతా అందితే జుట్టు .. అందకపోతే కాళ్లు పట్టుకునే మనస్థత్వం అని చాలా సార్లు రుజువు అయింది. ఇప్పుడు తనపై అనర్హతా వేటువేస్తే మ‌ళ్లీ  గెలవడం అసాధ్యం అని అర్థం కావడంతో ఆయన ఒక్కరోజు అసెంబ్లీకి హాజరవ్వాలని అనుకుంటున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  వరుసగా మూడు సెషన్లు లేదా.. అరవై రోజుల్లో ఒక్క‌రోజైనా సభకు హాజరు కాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది.  అయితే, కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన ద‌గ్గ‌ర నుంచి జ‌గ‌న్ కేవ‌లం ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు మాత్ర‌మే అసెంబ్లీకి వ‌చ్చాడు. ఆ త‌రువాత జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు స‌మావేశాల‌కు హాజ‌రు కాలేదు. వచ్చే సమావేశాలకు హాజరు కాకపోతే వారిపై  అన‌ర్హ‌త వేటే వేసేందుకు అవ‌కాశం ఉంటుంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ ప్ర‌క్రియ‌ను పూర్తి చేస్తారు. సెలవు చీటీ స్పీకర్ కు రాసి పంపినా ఆయన ఆమోదించాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకు.. అనుకుంటున్నారేమో కానీ.. ఒక్కరోజు అసెంబ్లీకి పోతే పోలా అని జ‌గ‌న్‌ అనుకుంటున్నారు. గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యేందుకు జగన్ తోపాటు ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.  అలా ఒక్కరోజు హాజరైతే ఆ తర్వాత అరవై రోజుల పాటు అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఉండదని అనుకుంటున్నారు.   ఇది సాంకేతికంగా అనర్హత వేటు నుంచి తప్పించుకునే పద్ధతి మాత్రమే.  కానీ, ఇలా అడ్డగోలుగా అసెంబ్లీకి డుమ్మా కొడితే తర్వాత ప్రజలు ఎందుకు ఓట్లు వేస్తారు? అని వైసీపీ నేతలే అంటున్నారు. జగన్ తాజా   నిర్ణ‌యాన్ని వైసీపీ నేత‌లుసైతం స‌మ‌ర్ధించ‌డం లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి‌. ఇలా అయితే, వైసీపీ  మనుగ‌డ ఉండదన్న ఆందోళన వైసీపీ నేతలలో వ్యక్తమౌతోంది. 
Publish Date: Feb 23, 2025 9:15AM

మెట్టు దిగి అసెంబ్లీకి వస్తున్న మాజీ సీఎం!

 ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని ఎంత హడావుడి చేస్తున్నారో అందరికీ తెలుసు. ఆఖరికి స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోర్టు మెట్లు కూడా ఎక్కారాయన. తనకు హోదా వచ్చే వరకు అసెంబ్లీ మెట్లెక్కనని  భీష్మించుకు కూర్చొన్నారు. అంతా తన ఇష్ట ప్రకారమే జరగాలని భావించే మాజీ సీఎంకు శాసనసభ నిభందనలు తెలిస్తే కాని తత్వం బోధ పడలేదు. ఏ శాసనసభ్యుడైనా స్పీకర్‌కు సరైన రీజన్ చూపించకుండా ఆరు నెలల పాటు అసెంబ్లీకి గైర్హాజరైతే అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్‌కి ఉంటుంది. అయితే స్పీకర్లు తమకు ఉన్న ఆ విచక్షనాధికారాల్ని పెద్దగా ఉపయోగించిన సందర్భాలు కనిపించవు. అయితే ఏపీలో స్పీకర్‌గా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణంరాజులను జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో వేధింపులకు గరి చేశారు. వారు ఎక్కడ తమ విచక్షణాధికారాలకు పని చెప్తారో అన్న భయంతో జగన్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం అసెంబ్లీకి రావడానికి రెడీ అయ్యారు. కేసీఆర్ కూడా తెలంగాణలో అనర్హత వేటు భయంతోనే బడ్జెట్ సమావేశాల రోజు అసెంబ్లీలో అటెండెన్స్ వేయించుకుని వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జగన్ కూడా అదే భయంతో బెట్టు మాని.. మెట్టు దిగుతున్నారు. జగన్ అసెంబ్లీకి వస్తున్నారు సోమవారం శాసనమండలిలోని వైసీపీ కార్యాలయంలో మీటింగ్‌ ఉంది.. సభ్యులంతా హాజరవ్వాలని బొత్స సత్యనారాయణ రాసిన లేఖతో జగన్ అసెంబ్లీ షెడ్యూల్ ఖరారైంది.
Publish Date: Feb 22, 2025 6:34PM

పెద్దల సభలోకి లోకనాయకుడు.. క్లారిటీ ఇచ్చిన కమల్

మక్కల్ నిది మయ్యమ్ పార్టీ అధినేత, విశ్వనటుడు కమల్ హాసన్‌ను అధికార డీఏంకే పార్టీ రాజ్యసభకు పంపనుంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం ఎం కె స్టాలిన్.. ఇప్పటికే తన కేబినెట్ మంత్రి ద్వారా కమల్ హాసన్‌కు సమాచారం పంపారు. ఈ ఏడాది జులైలో డీఏంకే పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్‌ను పెద్దల సభకు పంపేందుకు డీఏంకే సన్నాహాలు చేస్తోంది. గత ఏడాది మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో డీఏంకేతో మక్కల్ నిది మయ్యమ్ పొత్తు పెట్టుకొంది. అయితే ఆ ఎన్నికల్లో కోయంబత్తురు నుంచి కమల్ హాసన్ బరిలో నిలవాలని భావించారు.  కోయంబత్తురు నియోకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. కానీ ఈ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బరిలోకి దిగారు. దీంతో డీఏంకే అధినేత, సీఎం ఎం.కె. స్టాలిన్ సలహా, సూచనలతో కమల్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. మరోవైపు తమిళ ప్రముఖ నటుడు విజయ్ సైతం తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించారు. ఆయన సైతం ప్రజల మధ్యకు వెళ్తున్నారు. అందులో భాగంగా వివిధ సమయాల్లో పలు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఇంకోవైపు 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ వ్యూహాత్మకంగా అడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో డీఏంకే పార్టీ అధినేత, సీఎం ఎం.కె.స్టాలిన్ తనదైన శైలిలో ప్రణాళికలు రచిస్తున్నారు. అందులోభాగంగా కమల్ హాసన్‌ను రాజ్యసభకు పంపడం ద్వారా చిత్ర పరిశ్రమకు తమ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందనే బలమైన సంకేతాలను ప్రజల్లోకి పంపేందుకు డీఏంకే ఈ నిర్ణయం తీసుకుందని పరీశీలకులు విశ్లేషిస్తున్నారు. తాను రాజ్యసభకు వెళ్తున్న విషయాన్ని లోకనాయకుడు తాజాగా నిర్ధారించారు.  ఎంఎన్‌ఎం 8వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా చెన్నైలోని పార్టీ హెడ్‌క్వార్టర్స్‌లో జెండాను ఆవిష్కంచి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన కమల్ హసన్ తాను రాజ్యసభకు వెడుతున్న విషయాన్ని ధృవీకరించారు. ఈ సందర్భంగా తన పొలిటికల్‌ కెరీర్‌పై కమల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి చాలా ఆలస్యంగా వచ్చానని, 20 ఏళ్ల ముందే రాజకీయాల్లోకి వచ్చి ఉంటే ఇప్పుడు తన ప్రసంగం, స్థానం వేరేలా ఉండేవని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది పార్లమెంట్‌లో మన పార్టీ గొంతు వినిపించబోతోందని ఆయన చేసిన  వ్యాఖ్యలతో  కమల్‌ హాసన్‌ రాజ్యసభలో అడుగుపెట్టనున్నట్లు ఇటీవల జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరినట్లు అయింది.
Publish Date: Feb 22, 2025 1:22PM

పాక్‌కి షాక్ ఇచ్చి లెక్క సరిచేస్తారా?

ఛాంపియన్స్‌ ట్రోఫీ.. ఎన్ని జట్లు తలపడుతున్నా, భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ లెక్కే వేరేగా ఉంటుంది. ఆ రెండు దేశాల అభిమానులే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు టీవీల ముందుకు చేరిపోతారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇండియా, పాక్ మధ్య పోరు అంటే హైఓల్టేజ్‌ మ్యాచ్‌. చిరకాల ప్రత్యర్థులైన దాయాది జట్లు ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఆదివారం తలపడుతున్నాయి. గత ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ను ఓడించిన పాక్ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే ఈ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పాక్‌ మొదటి మ్యాచ్ ఓటమితో ప్రారంభించగా.. బంగ్లాపై ఘన విజయంతో భారత్‌ రెట్టించిన ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగుతోంది.  ఈ సారి బ్యాట్స్‌మాన్ ఫకర్‌ జమాన్‌ దూరం కావడం పాక్‌ జట్టుకు పెద్ద లోటే. స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ అజామ్‌ ఫామ్‌ లేమి కూడా వారిని ఇబ్బంది పెడుతుంది. మరోవైపు బుమ్రా లేకపోయినా.. టీమ్‌ఇండియా పేస్‌ దళాన్ని తొలి మ్యాచ్‌లో అద్భుతంగా షమీ ఐదు వికెట్ల ప్రదర్శనతో ముందుకు నడింపించాడు. అతడికి హర్షిత్‌ రాణా తోడయ్యాడు. స్పిన్నర్లు కూడా తమవంతు ప్రాత్ర పోషించారు. మరి వీరు పాకిస్థాన్‌పై ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. ఇక దూకుడుగా ఆడుతున్న రోహిత్‌, సెంచరీ గిల్‌ మరోసారి చెలరేగితే.. టీమ్‌ఇండియాకు భారీ పరుగులు ఖాయమే. పాకిస్థాన్‌పై గొప్ప గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. తన మునుపటి ఫామ్‌ను అందుకొని రాణిస్తే పాక్‌కు కష్టాలు తప్పవు  తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన పాకిస్థాన్‌కు భారత్‌తో మ్యాచ్‌ అత్యంత కీలకం. ఈ మ్యాచ్‌లో ఓడితే ఆ ఆతిధ్య జట్టు టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టాల్సిందే. దీంతో ఆ జట్టును భారత్ ఏమాత్రం తక్కువగా అంచనా వేయడం లేదు. దాయాదుల పోరు అంటే రెండు జట్ల ఆటగాళ్లు ప్రాణంపెట్టి ఆడతారన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌, పాకిస్థాన్‌ జట్లు ఐదుసార్లు తలపడ్డాయి. అందులో మూడు సార్లు పాకిస్థాన్‌ నెగ్గి పైచేయి సాధించింది. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ గ్రూప్‌ స్టేజ్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయాన్ని భారత్‌ నమోదు చేసింది. గ్రూప్‌ బీలో భాగంగా జూన్‌ 4న ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరిగింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 48 ఓవర్లకు కుదించగా.. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్‌కు 41 ఓవర్లలో 289 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు. అయితే.. పాక్‌ 33.4 ఓవర్లలో 164 పరుగులే చేసింది. డక్‌వర్త్‌ పద్ధతిలో టీమ్‌ఇండియా విజేతగా నిలిచింది. యువరాజ్‌ మ్యాన్‌ ఆప్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.  2017 ఫైనల్‌కు చేరిన భారత్‌.. తిరిగి పాకిస్థాన్‌తోనే తలపడింది. జూన్‌ 18న లండన్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా మ్యాచ్‌ జరగ్గా.. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 50 ఓవర్లలో టీమ్‌ఇండియా ముందు 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. ఘోరంగా విఫలమై 158 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. దీంతో తొలిసారి పాకిస్థాన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీని ముద్దాడింది. ఆనాటి ఫైనల్‌లో ఘోర ఓటమికి బదులు తీర్చుకొనే అవకాశం ఇప్పుడు టీమ్‌ఇండియాకు వచ్చింది. గత వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన మన మెన్ ఇన్ బ్లూ... మరోసారి ఆ జట్టును ఓడించి సత్తా చాటాలని ప్రతీ భారత అభిమాని కోరుకుంటున్నాడు. దుబాయ్‌ వేదికగా జరిగే ఆదివారం నాటి మ్యాచ్‌లో విజయం సాధించి చాంపియన్ ట్రోఫీలో రెండ జట్ల మధ్య ఫలితాల లెక్కను 3-3తో సరిచేయాలని ఆకాంక్షిస్తున్నారు. పలువురు సీనియర్లకు ఇదే చివరి ట్రోఫీ అని భావిస్తున్న తరుణంలో పాకిస్థాన్‌పై చెలరేగి ఆడి.. కెరీర్‌కు ముగింపు పలకాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Publish Date: Feb 22, 2025 1:09PM

మహాకుంభ్ లో ఇప్పటికే 60 కోట్ల మంది పుణ్యస్నానాలు

ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళాకు భక్త జనం పోటెత్తుతున్నారు. శుక్రవారం నాటికే మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య 60 కోట్లకు చేరువైంది.  మామూలుగా 12ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలుగా కాకుండా  మహాకుంభమేళా 144 సంవత్సరాల తరువాత వచ్చింది. 40 రోజులు పాటు సాగే ఈ కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. మహా శివరాత్రితో ముగియనున్న కుంభమేళా గడువు దగ్గరపడుతుండటంతో భక్తుల తాకిడి మరింత పెరుగుతోంది.  హిమాలయాలనుంచి కూడా సాధువులు వచ్చి పుణ్య స్నానాలు చేయడం విశేషం. దేశం,విదేశాల నుంచి కూడా కుంభమేళాకు తరలి వస్తున్నారు.  విమానాలు,రైళ్లు,బస్సులు,కార్లు ఇలా ఏ వాహనం దొరికితే దానిలో ప్రయాగ్ రాజ్ బాట పడుతున్నారు భక్తులు.  వాహనాలతో వందల కి.మీ ట్రాఫిక్ జామ్ అవుతున్నది.  భారతదేశ జనాభా 145 కోట్లలో హిందువులు 110 కోట్లకు పైగా ఉన్నారు.వారిలో సగం మందికి పైగా ఇప్పటికే మహాకుంభమేళాకు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు.  
Publish Date: Feb 22, 2025 11:37AM