తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. టాప్‌టెన్‌లో బాలుర హవా

 


తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి జేఎన్‌టీయూ ఆడిటోరియంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈనెల 12న నిర్వహించిన ఎంసెట్ ఎగ్జామ్ లో ఇంజనీరింగ్‌ విభాగంలో 1,39,100 మంది... అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 73,601 మంది విద్యార్థులు పరీక్ష రాయగా...ఇంజనీరింగ్‌ విభాగంలో 74.5 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్‌, ఫార్మీసీ విభాగంలో 86.49 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కాగా ఈ సారి ఫలితాల్లో టాప్‌టెన్‌లో బాలుర హవా కొనసాగింది.