తిరుమలలో మంత్రి పోచారంకు తీవ్ర అస్వస్థత

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఆయన తిరుమలలో మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చారు. ఉదయం వీఐపీ దర్శన ప్రారంభసమయంలో కేసీఆర్‌తో పాటు ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే ఉదయం అల్పాహారం తీసుకోకపోవడంతో పోచారం స్వల్పంగా అనారోగ్యానికి గురయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన బంధువులు, సిబ్బంది ఆయనను అశ్వినీ ఆస్పత్రికి తరలించారు. ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో వెంటనే పక్కనే ఉన్న అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.