తెలుగు రాష్ట్రాలు బాగుండాలని కోరుకున్నా-కేసీఆర్

తెలుగు రాష్ట్రాలు చల్లగా ఉండాలని శ్రీవారిని ప్రార్ధించినట్లు తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెంది, దేశంలోనే అగ్రగామి రాష్ట్రాలుగా పేరు తెచ్చుకోవాలని స్వామి వారిని కోరుకున్నానని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల సంబంధాలు చాలా గొప్పగా ఉంటాయన్నారు. హైదరాబాద్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సహకరిస్తామని..భగవంతుడికి ప్రాంతీయ భేదాలు లేవన్నారు. తెలంగాణ నుంచి వచ్చిన తమ కుటుంబసభ్యులకు, మంత్రులకు, అధికారులకు చక్కటి దర్శనం అందిందని పేర్కొన్నారు.