శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో కుటుంబసభ్యులు, మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం వకుళామాతను, శ్రీ విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం 5 కోట్ల విలువైన బంగారు అభరణాలను సమర్పించారు. 14.2 కిలోల బంగారు సాలిగ్రామహారం, 4.65 కిలోల బంగారు కంఠెను సమర్పించారు. అనంతరం వేద పండితులు కేసీఆర్ కుటుంబసభ్యులను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు.