టి.బిల్లుపై సుష్మాకు ప్రధాని ఫోన్

 

pm on telangana, telangana sushma, telangana bjp

 

 

తెలంగాణపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో తెలంగాణ బిల్లుకు మద్దతివ్వాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్‌ కోరారని ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు, అంబర్ పేట శాసన సభ్యుడు కిషన్ రెడ్డి విలేకరులతో చెప్పారు. దీంతో తెలంగాణ ఏర్పాటు తధ్యం అని తేలిపోయింది. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలపాలని సుష్మ స్వరాజ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పారు. తాము హైదరాబాదు రాజధానికి పది జిల్లాలతో కూడిన తెలంగాణపై బిల్లు పెడితే మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు.