తెరాస 'తెలంగాణ రాబందుల పార్టీ'

 

tdp trs, telangana tdp, trs telangana

 

 

రాజకీయ పార్టీలు ఒకరినొకరు విమర్శించుకోవడానికి కొత్త డైలాగులు కనిపెడుతున్నారు. గత కొంత కాలంగా టీడీపీని 'తెలంగాణ ద్రోహుల పార్టీగా' టీఆర్ఎస్ ప్రచారం చేస్తూంటే, దానికి పోటిగా టిడిపి మరో డైలాగు పేల్చింది. టీఆర్ఎస్ పార్టీని 'తెలంగాణ రాబందుల పార్టీగా' అభివర్ణించింది. టిఆర్ఎస్ తెలంగాణ అంశం పేరుతో పలువురు విద్యార్థుల ప్రాణాలను బలిగొన్నారని టిడిపి ఎమ్మెల్యేలు సీతక్క, సత్యవతి రాధోడ్ లు ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. అవకాశవాదులే టిఆర్ఎస్ లో చేరుతున్నారని వారు మండిపడ్డారు. సీమాంధ్ర పార్టీలో ఉండి ఏమీ చేయలేకపోయానని కడియం శ్రీహరి అంటున్నారని, 1969 నుంచి తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే కడియంకు 2013లోనే కనువిప్పు ఎందుకు కలిగిందని, ఆయనకు నిజంగా తెలంగాణ పై ప్రేమ ఉంటే అమరులైన కుటుంబాలలో ఒకరికి తన టిక్కెట్ ఇవ్వగలరా అని వారు సూటిగా ప్రశ్నించారు.