టీడీపీ మద్దతుదారుల ఇళ్లకు వెళ్లే దారికి అడ్డంగా గోడ!!

 

ఏపీలో అధికార పార్టీ వైసీపీ.. తమ పార్టీ సానుభూతి పరులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామానికి చెందిన టీడీపీ మద్దతుదారులు ఈరోజు పోలీసులను ఆశ్రయించారు. వైసీపీ నేతలు తమను తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించారు.

తమ ఇళ్లకు వెళ్లే మార్గంలో అడ్డంగా గోడ నిర్మిస్తూ దారి లేకుండా చేస్తున్నారనీ, మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాలని ఫిరంగిపురం పోలీసులను కోరారు. దీంతో స్పందించిన పోలీసులు వైసీపీ నేతలు, మద్దతుదారులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి మాట్లాడారు. గోడ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. పోలీసుల ఆదేశంతో గోడ నిర్మాణాన్ని వైసీపీ నేతలు ఆపేశారు.