టి.కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేయాలి.

 

టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యే హరీష్ రావు అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ ... శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న దాడులకు నిరసనగా డిఎంకే అధినేత కరుణానిధి కఠిన నిర్ణయం తీసుకున్నారు. డిఎంకే మద్ధతు ఉపసంహరణ నేపథ్యంలో తెలంగాణా ఎంపీలు తక్షణమే స్పందించి తమ ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి ఇదే సరైన సమయమని, మైనారిటీలో పడిన యుపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణా రాష్ట్రం ఏర్పడటానికి తమ వంతు కృషి చేయాలని హరీష్ రావు పేర్కొన్నారు.