శ్రీలంక మిత్రదేశం కాదు ... జయలలిత
posted on Mar 28, 2013 9:25AM
శ్రీలంకకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అసెంబ్లీలో తీర్మానం పెట్టగా ఈ తీరమానానికి అన్ని పార్టీలు మద్ధతు తెలపటంతో సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. శీలంకలో ప్రత్యేక తమిళ రాష్ట్రం ఈలం కోసం తమిళులు నివసిస్తున్న ప్రాంతాల్లో రెఫరెండం నిర్వహించాలని, తమిళుల ఊచకోతపై అంతర్జాతీయ స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని, తమిళుల హత్యాకాండకు బాధ్యులైన వారిని అంతర్జాతీయ న్యాయస్థానం ముందు నిలబెట్టి తగిన విధంగా శిక్షించాలని, శ్రీలంక తమిళుల అణిచివేటను ఆపాలని ఈ తీర్మానం డిమాండ్ చేసింది. భారతదేశం శ్రీలంకకు మిత్రదేశం హోదాను రద్దుచేయాలని, ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలు విధించాలని జయలలిత కేంద్రానికి ఒక లేఖ రాశారు.