బాంబుల దాడిలో 200 మంది మృతి...

 

సిరియా సైన్యం చేసిన బాంబుల దాడిలో దాదాపు 200 మంది సాధారణ పౌరులు మృతి చెందారు. కొన్ని సంవత్సరాలుగా ఉగ్రవాదుల అధీనంలోని తూర్పు గౌటా ప్రాంతంపై సిరియా సైన్యం బాంబుల వర్షం కురిపించింది. దీంతో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితిలో 57 మంది చిన్నారులు సహా 200 మంది మృత్యువాతపడగా, మరో 300 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆసుపత్రుల్లో వారికి చికిత్స కష్టమవుతోందని తెలిపుతున్నారు వైద్యులు.