క్షమాభిక్ష పిటిషన్ పై సుప్రీం కీలకతీర్పు

 

 

 

క్షమాభిక్ష పిటిషన్ పైన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. క్షమాభిక్ష పిటిషన్‌పైన నిర్ణయంలో జాప్యం జరిగితే మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చేందుకు ప్రతిపాదన ఉన్నట్లేనని పేర్కొంది. ఏకాంత శిక్ష అనుభవిస్తున్న వారికి మానసిక అస్వస్థత ఉంటే మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చవచ్చునని సుప్రీం వెల్లడించింది. దీంతో నలుగురు వీరప్పన్ అనుచరులు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో నిందితులు సహా మొత్తం పదిహేను మందికి విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది. క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు గురైతే ఖైదీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.