కేంద్రానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు..


విభజన హామీలపై కేంద్రానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. విభజన హామీలు నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్‌ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కేంద్రం.... నాలుగేళ్లయినా ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించింది. అంతేకాదు.. ఇదే విషయంపై గతంలో నోటీసులు జారీ చేసినా ఎందుకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక దీనికి గాను కేంద్రం.. దీనిపై సవివరంగా వివరణ ఇచ్చేందుకు నాలుగు వారాలు గడువు కోరింది. దీనికి అంగీకరిస్తూ ఈ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలు వాయిదా వేసింది.