కన్నాకు రాజ్యసభ.. బీజేపీ కొత్త అధ్యక్షుడిగా సుజనా చౌదరి!!

 

ఏపీ బీజేపీలో మార్పులు రాబోతున్నాయని అంటున్నారు కమలనాథులు. వచ్చే నెలలో బీజేపీ సంస్థాగత ఎన్నికలు ముగుస్తాయి. బీజేపీకి కొత్త అధ్యక్షుడితో పాటు రాష్ట్రాలకు కూడా కొత్త సారథులు వస్తారని ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏపీ కూడా కొత్త ప్రెసిడెంట్ వస్తారని తెలుస్తుంది. ప్రస్తుత బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణను రాజ్యసభకు పంపించి వచ్చే నెలలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో కేంద్ర మంత్రిని చేస్తారని కార్యకర్తల్లో టాక్. ఆయన కేంద్ర మంత్రిగా వెళ్తే ఆయన ప్లేస్ లో ఎవరిని అధ్యక్షుడిగా నియమిస్తారనే చర్చ కూడా వినిపిస్తుంది. అధ్యక్ష రేసులో బీజేపీలో చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రెసిడెంట్ రేసులో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇటీవలే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరితో పాటు బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డికి పగ్గాలు అప్పగించవచ్చనే ప్రచారం జరుగుతుంది. యువతకు చాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది.. సీనియర్లకూ మరోసార అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది.. అనే దానిపై అధిష్టానం వివరాలు సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ బీజేపీ అధిష్టానం సుజనకు కేంద్రంలో బెర్తిస్తే అధ్యక్ష రేసులో కన్నా విష్ణువర్దన్ రెడ్డి మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉంది. మొత్తానికి ఇటు కేంద్ర కేబినెట్ బెర్త్ గానీ అటు ఏపీ బీజేపీ అధ్యక్ష రేసులో తీవ్ర పోటీ నెలకొంది. మరో నెలలో ఏపి బిజెపిలో మార్పులు మాత్రం ఖాయమని తెలుస్తుంది. కొత్త ఏడాదిలో కొత్త అధ్యక్షుడు వస్తారనేది మాత్రం గ్యారెంటీ. ఆయన ఎవరనేది మరి కొద్ది రోజుల్లో తేలనుంది.