ముందస్తు వద్దు.. రాజ్‌భవన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం

 

తెలంగాణలో ఓ వైపు అసెంబ్లీ రద్దు, ముందస్తు అంటూ హడావిడి జరుగుతుంటే.. మరోవైపు ఓ యువకుడు ముందస్తు వద్దంటూ రాజ్‌భవన్ ముందు ఆత్మహత్యాయత్నం చేసాడు.. రాజ్ భవన్ ముందు ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించాడు.. సకాలంలో రాజ్‌భవన్ సిబ్బంది స్పందించడంతో ప్రమాదం తప్పింది.. సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళుతుండటాన్ని నిరసిస్తూ ఆత్మహత్యకు యత్నించినట్టు యువకుడు తెలిపాడు.. తన పేరు ఈశ్వర్ అని, నిజాం కాలేజీ పాత విద్యార్థినని నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి నుంచి వచ్చినట్టు తెలిపాడు.. ఉద్యమకారులకు, తెలంగాణ కోసం అమరులైన వారికి, నిరుద్యోగ యువతకు ఏం చేశారని కేసీఆర్ ముందస్తుకు వెళుతున్నారని ప్రశ్నించాడు.. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్నది తన డిమాండ్ అని తెలిపాడు.