పవన్ పై శ్రీరెడ్డి సర్వే

ఇటీవల తెలుగు చిత్రసీమ, నటులపై విమర్శలు చేసి నిత్యం వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి రాజకీయలపై తనదైన శైలిలో స్పందించింది... సైదాబాద్‌లో ఓ బేకరి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనను రెండు రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తున్నాయని, అయితే, తనకు ఆసక్తి లేదని చెప్పారు. సోషల్‌ మీడియాలో తాను రాజకీయాలలో వస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమని అన్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. ఏపిలో  రాబోయే ఎన్పికలలో పవన్‌ కళ్యాణ్‌కు ఘోర పరాభవం తప్పదన్నారు. కేవలం మూడు, నాలుగు సీట్లకు మాత్రమే పరిమితం కావచ్చని తెలిపారు.