గల్లా గారు మీరు గ్రేట్.!!

అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విజృంభించిన సంగతి తెలిసిందే. ఆధ్యంతం ఆసక్తికరంగా జరిగిన ప్రసంగాన్నిటీడీపీ ఎంపీలతో పాటు మిగతా పార్టీకి చెందిన ఎంపీలు తథేకంగా వీక్షించారు.కేంద్ర ప్రభుత్వం మొదలుకుని,రాష్ట్రాన్ని విభజించిన అన్ని పార్టీలపై గల్లా విమర్శలు గుప్పించారు.

 

 

అంతేకాదు విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదని.. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే వారిని మనిషి అనరని ‘భరత్ అనే నేను’ సినిమాను కూడా ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఉదయం గల్లా జయదేవ్,సాయంత్రం కింజరపు రామ్మోహన్ నాయుడు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. గల్లా, రామ్మోహన్ నాయుడు ప్రసంగాలపై ఏపీ ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు ప్రశంసించారు. అయితే సినీ రంగంపై సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి..జయదేవ్ ఇచ్చిన స్పీచ్ పై ఫేస్‌బుక్ వేదికగా స్పందించింది. " గల్లా గారు..పార్లమెంట్‌లో మీ ప్రసంగం అదుర్స్ సార్.. ఆంధ్రప్రదేశ్ గర్విస్తోంది. మీరు మాట్లాడుతుంటే ప్రత్యర్థి పార్టీ సభ్యుల ముఖాల్లో నెత్తుటి చుక్క కూడా లేదు,థ్యాంక్యూ సార్,గ్రేట్ లీడర్" అని తన ఫేస్‌‌బుక్‌లో పోస్ట్ చేసింది.