దూకుడు పెంచిన సోము వీర్రాజు.. ముద్రగడతో కీలక భేటీ 

ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఈరోజు పలువురు ప్రముఖ నేతలను కలవనున్నట్లుగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా అయన ఇదే విషయమై కాపు ఉద్యమ నాయకుడు.. ముద్ర‌గ‌డ పద్మనాభం ‌ను క‌లిసి చ‌ర్చించారు. "మాజీ మంత్రి , కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారిని మర్యాదపూర్వకంగా కలిశాన‌ని.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ముద్రగడ ఒక కీల‌క పాత్ర పోషించాల్సిన‌ అవసరం ఉంద‌ని" సోము వీర్రాజు తెలిపారు.

 

"రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కుటుంబ రాజకీయాల నుండి విముక్తి కల్పిస్తూ.. ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ, జనసేన కూటమి రాబోయే రోజులలో కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో మా మధ్య జరిగిన స్నేహపూర్వక భేటీ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. తమ పట్ల ముద్రగడ చూపిన ఆదరాభిమానాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని అయన పేర్కొన్నారు.