టీడీపీ వల్ల చిత్రహింసలు అనుభవించాం..

 

ఇప్పటికే టీడీపీపై ఎన్నో విమర్శలు గుప్పించిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి టీడీపీ పై విరుచుకుపడ్డారు. ఇంకొంత కాలం టీడీపీ మద్దతు కొనసాగి ఉంటే... తమకు ఆత్మహత్యే శరణ్యం అయి ఉండేదని.. తెలుగుదేశం పార్టీ మద్దతు వల్ల తాము చిత్రహింసలను అనుభవించామని అన్నారు. అంతేకాదు.. రాయలసీమపై ముఖ్యమంత్రి చంద్రబాబు సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని.. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర నిధులతోనే పూర్తి చేస్తామని టీడీపీ నేతలు అంటున్నారని... పెండింగ్ లో ఉన్న ఇతర ప్రాజెక్టులను కూడా రాష్ట్ర నిధులతోనే పూర్తి చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులతో ఎలాంటి అభివృద్ధి చేశారో చూపించాలని డిమాండ్ చేశారు.