అడ్డంగా దొరికిన వైసీపీ, బీజేపీ

 

వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బీజేపీ నేతలని కలిసారని.. వైసీపీ,బీజేపీలు కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని టీడీపీ నేతలు మండిపడిన సంగతి తెలిసిందే..  అయితే ఇవన్నీ టీడీపీ చేస్తున్న అవాస్తపు ఆరోపణలని బీజేపీ,వైసీపీ లు ఖండించాయి.. కానీ టీడీపీ సాక్ష్యాలు బయటపెట్టి మరీ బీజేపీ, వైసీపీలను ఇరుకున పెట్టింది.. కేశినేని నాని మాట్లాడుతూ 'మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.. ప్రభుత్వ వాహనం వెళ్ళినప్పుడు లాగ్ బుక్ మెయింటైన్ చేస్తారు.. ఆ బుక్ ప్రకారం బుగ్గన, రామ్ మాధవ్ ఇంటికి వెళ్లినట్టుంది' అన్నారు.. సాక్ష్యాలతో సహా దొరికిపోవడంతో.. బీజేపీ ముఖ్యనేత రామ్ మాధవ్ ఇంటికి బుగ్గన ఎందుకెళ్ళారు?.. ఇదంతా చూస్తుంటే బీజేపీ, వైసీపీలు నాటకాలు, కుట్ర రాజకీయాలు చేస్తున్నట్టు అర్ధమవుతుందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.