భారత్‌-పాక్‌లను కలపడానికి మేం పెళ్లి చేసుకోలేదు..!!

 

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.. 'మేమేదో  భారత్‌-పాకిస్థాన్‌లను కలపడానికి పెళ్లి చేసుకున్నామని చాలా మంది అపోహపడుతుంటారు.. ఇది నిజం కాదు.. సంవత్సరానికోసారి పాకిస్థాన్‌లోని మా అత్తగారి కుటుంబాన్ని కలవడానికే వెళతాను.. వాళ్లు నాపై అపారమైన ప్రేమ కురిపిస్తారు.. ఆ దేశం అంతా నన్ను వదిన అని సంభోదిస్తూ, గౌరవంగా చూస్తారు.. క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా నా భర్తను అక్కడి ప్రజలు అభిమానిస్తారు.. ఆ అభిమానమే నాపై ప్రేమగా మారింది.. షోయబ్‌ భారత్‌ వచ్చినప్పుడూ  ఇదే జరుగుతుంది.. అతడిపైనా ఇక్కడి ప్రజలు ప్రేమ చూపిస్తారు' అని తెలిపారు.