రవీందర్ గైక్వాడ్ టికెట్ మళ్లీ రద్దు...

 

శివసేన ఎంపీ రవీందర్ గైక్వాడ్ టికెట్ మళ్లీ రద్దైంది. ఎయిర్ ఇండియా ఈయన టికెట్ ను మళ్లీ రద్దు చేసింది. రవీందర్ గైక్వాడ్ ఇటీవల ఎయిర్ ఇండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు తాను బయటకు వచ్చిన తరువాత కూడా మీడియా ముందు చాలా దురుసుగా వ్యాఖ్యానించారు. అవును కొట్టాను ఒకసారి కాదు 25 సార్లు కొట్టాను అని అన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎయిర్ ఇండియా ఆయనను నిషేద జాబితాలో చేర్చింది. ఎయిర్ ఇండియాతో పాటు... పలు విమానయాన సంస్థలు కూడా ఆయనపై నిషేదం విధించాయి. దీంతో ఆయన రైలులో ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా మరోసారి గైక్వాడ్‌ విమాన టికెట్‌ను రద్దు చేసింది. ముంబై వెళ్లిన ఆయన రేపు దిల్లీకి రానున్న నేపథ్యంలో ఎయిరిండియా ఓపెన్‌ టికెట్‌ ఉండటంతో ఆయన టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. అయితే  ఎయిరిండియా ఆయన టికెట్‌ను మరోసారి రద్దు చేసింది. మరి దీనిపై ఎంపీ గారు ఎలా స్పందిస్తారో చూడాలి.