చంద్రబాబుకు బిగ్ షాక్... ఆ సీనియర్ లీడర్ వైసిపి లోకి జంప్

 

 

టీడీపీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ నుండి ముఖ్య నేతలు వలస పోతున్నారు. కారణాలేమైనప్పటికీ ముఖ్య నాయకులు అటు బీజేపీ లోకి లేదా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి లోకి జంప్ చేస్తున్నారు. తాజాగా నెల్లూరు లో టీడీపీ ముఖ్య నేత బీద మస్తాన్ రావు బాబుకు ఝలక్ ఇస్తూ టీడీపీ కి రాజీనామా చేసి సీఎం జగన్ సమక్షంలో వైసిపి లో చేరారు. గత ఎన్నికల్లో బీద మస్తాన్ రావు టీడీపీ తరుఫున నెల్లూరు ఎంపీగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా మస్తాన్ రావు మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్  అనతికాలంలోనే 80 శాతంపైగా ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి జగన్ అమలు చేసారని ప్రశంసించారు. నెల్లూరు టీడీపీ లో కీలక నేతగా ఉన్న మస్తాన్ రావు పార్టీకి గుడ్ బై చెప్పడం తో జిల్లాలో పార్టీ బలహీన పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.