సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్

 

 

 

లోకసభలో సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను సస్పెన్షన్ చేస్తున్నట్లు స్పీకర్ మీరా కుమార్ ప్రకటించారు. రెండు గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ఆమె వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. అనంతరం సభను మూడుగంటలకు వాయిదా వేశారు. రాజ్యసభలోను ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన అనంతరం జరిగిన పరిణామాలపై స్పీకర్ మీరాకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తాను చాలా బాధపడుతున్నా....విచారిస్తున్నాని స్పీకర్ అన్నారు. ఇప్పుడు మాట్లడలేని పరిస్థితిలో ఉన్నానని తెలిపారు. సభలో ఈరోజు జరిగిన ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చ అని స్పీకర్ మీరాకుమార్ అన్నారు.