ఇద్దరు లేక ముగ్గురు చాలరు మొర్రో

 

సత్తి : ఒరే నాయుడు బావ పెభుత్వమేమో ఒక్కళ్ళు లేక ఇద్దరు సాలని సెపుతుంటే మన అన్నేట్రా అట్టా సెపుతున్నాడు?

 

నాయుడు : ఏటి అన్న నిన్నేమి గంపెడు పిల్లల్ని కనమని గానీ సెప్పినాడా? ఏటి?

 

సత్తి : అది కాదహే..ముగ్గురేమో నలుగురవ్వాలి... ఆ నలుగురు రేపు.. ఐదుగురు.. రేపు ఆరుగురు కావాలని అంటే మరర్ధం ఏటి? అదే గదా..

 

నాయుడు : ఓస్! అదా నీ ధర్మసందేహం..నానేమో ఏరేలా అనుకొన్నాలే..మరేటి నేదురా అన్న ఎక్స్ పార్టీ వోల్లందరినీ సమేకం కోసం తనెనుకే ఫాలో అయిపోమని సెపుతున్నాడన్నమాట. అందరూ తన ఎంటోస్తే సమేకం ఇప్పిచేస్తానని సెపుతున్నాడు.

 

సత్తి : ఓస్! అదా సంగతి. కానోరే సత్తిగా నాకోటి తెలవక అడుగుతాను. మనం పార్టీ ఎట్టి గట్టిగా మూడేళ్ళు కూడా కానేదు..మరి అన్న పిలిస్తే అందరూ పారెల్లి రాడానికి ఎక్స్ పార్టీ వోల్లెమయినా ఏర్రోళ్ళా..నేక పిచోళ్ళా సెప్పు!

 

నాయుడు : నిజమేననుకో...గానీ మనమే సమేకం సేత్తున్నామని జనాలు నమ్మాలంటే ఏటో ఒకటి సెప్పాలి గదా ఎర్రి నాయాలా?

 

సత్తి : సరే! ఆల్లందరూ నిజంగా మనోడెనుక వచ్చీనారనుకో...అప్పుడు మనోడు డిల్లీ ఓల్లతో మాట్లాడి ఒప్పించేయడానికి ఆల్లకి ఈయనేమయిన సుట్టమా..నేకపోతే స్నేహితుడా సెప్పు?

 

నాయుడు: ఒరేయ్ సత్తిగా! నా సావసంతో కూడా నీకు గ్యానం అబ్బకపోతే, ఇక నీకా దేవుడు కూడా గ్యానం ఇవ్వనేడురొరే... ఆ డిల్లీలో కూకొని కబుర్లు సేపుతాడే ఆడేవడబ్బా... ఆ! దిగ్గీజ సింగ్ అప్పుడెప్పుడో ఓపాలి ఎట్టన్నాడో గుర్తునేదేటి? మన అన్నని నా కొడుకులాంటోడే అని సెప్పాడా నేదా? ఆనక మన నగడపాటి బాబు కూడా ఆ పొద్దెపుడో డిల్లీ పాల్లమెంటు కాడ కూకొని ఏడుస్తూ “ఆ డెవరో దత్త కొడుకుని సూసుకొని మాయంటి సొంత కొడుకుల్నే అన్నేయం సేసీనావే సోనియమ్మా... అని రాగాలు తీసినాడా నేదా? మరిప్పుడు సెప్పు మన అన్న తలుసుకొంటే డిల్లీలో సెక్కరం తిప్పీగలడా నేదా?

 

సత్తి: నిజమేరో.. నా బల్బెలగనేదు సుమా!

 

నాయుడు: అదెప్పుడు ఎలగదు కూడా...హ.. హా.. హా..