వైసీపీ కీలక నేత టీడీపీలోకి...

 

వైసీపీ నుండి ఇప్పటికే ఎంతో మంతి నేతలు టీడీపీ లోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో నేత జగన్ షాకిచ్చి.. టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆ కీలక నేత శత్రుచర్ల చంద్ర శేఖర రాజు. ఈయన పార్టీ పెట్టినప్పటినుండి ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన పార్టీని వీడి తెలుగుదేశం గూటికి చేరుకున్నారు. పార్వతీ పురంలో పర్యటిస్తున్న నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఆయన టీడీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి లోకేశ్ శత్రుచర్లను పార్టీలోకి ఆహ్వానించారు.