చిన్మమ్మకు మరో షాక్...మరో 13 నెలల అదనపు శిక్ష..?

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు జైలు అధికారులు మరో షాక్ ఇచ్చారు. ఈ కేసులో తీర్పు సందర్భంగా చిన్నమ్మకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 కోట్లు జరిమానా విధించింది సుప్రీంకోర్టు. అయితే బెంగళూరు జైల్లో లొంగిపోవడానికి ముందు కాని లొంగిపోయిన తర్వాత కాని చిన్నమ్మ జరిమానా కట్టలేదు. అయితే శశికళ ఆ పదికోట్ల జరిమానా సమయానికి కట్టకపోతే ప్రస్తుతం అనుభవిస్తున్న జైలు శిక్ష కాకుండా మరో 13 నెలలు అదనపు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు సూపరింటెండెంట్ తెలిపారు. ఈ కేసులో ఇంతకుముందే జయలలితతో కలిసి 21 రోజులు జైలు శిక్ష అనుభవించిన శశికళ ఇక మిగిలిన మూడేళ్ల 11 నెలల శిక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది.