జయలలితపై శశికళ భర్త సంచలన వ్యాఖ్యలు...

 

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్న శశికళ భర్త నటరాజన్ ఇప్పుడు నోరు లేచినట్టుంది. ఏకంగా జయలలితపైనే సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఎంజీఆర్ మరణం తర్వాత జయలలితను తమ కుటుంబమే కాపాడిందని... తన భార్య శశికళ జయను 30 ఏళ్ల పాటు కాపాడిందని ఆయన చెప్పారు. అక్కడితో ఆగకుండా.. ఎంజీఆర్ అంత్యక్రియలకు జయలలితను తీసుకెళ్లామని... ఎంజీఆర్ భౌతికకాయాన్ని తీసుకెళుతున్న వాహనం నుంచి జయను తోసివేశారని... ఆ సమయంలో ఆమెకు అండగా తామే ఉన్నామని...జయలలిత ముఖ్యమంత్రి కాకుండా బ్రాహ్మణులు అడ్డుకున్నప్పటికీ, ఆమెను తామే ముఖ్యమంత్రిని చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో, తమ కుటుంబం రాజకీయాల్లో కొనసాగడం అనైతికమేమీ కాదని అన్నారు. మరి ఇన్ని రోజులు కుక్కిన పేనులా ఉన్న శశికళ భర్త నటరాజన్ అప్పుడే విశ్వరూపం ప్రదర్శించడంతో ఇప్పుడు నటరాజన్ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చాంశనీయమైంది.