శశికళ పై మరో ఆకాశరామన్న ఉత్తరం..

 

శశికళ రోజు రోజుకు ఎక్కువ చిక్కుల్లో పడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే బెంగుళూరులోని పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న తనకు.. వీఐపీ ట్రీట్ మెంట్ జరుగుతుందని.. సకల సదుపాయాలు అందుతున్నాయని.. ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు కూడా నిజమని తేలింది. ఇప్పుడు తాజాగా మరో అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. హోసూరు నుంచి అంబులెన్సులో ఆమెకు రకరకాల వస్తువులు వస్తున్నాయని... ఈ వ్యవహారం వెనుక కర్ణాటకకు చెందిన ఓ మంత్రి హస్తం ఉందని కర్ణాటక డీజీపీ మొదలు, కీలక అధికారులందరికీ ఓ ఆకాశరామన్న ఉత్తరం వచ్చినట్టు సమాచారం. దీంతో ఆ మంత్రి ఎవరబ్బా అనే చర్చ మొదలైంది. ఇక ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం విచారణను వేగవంతం చేసుకుంది. మొత్తానికి రోజుకో అంశంతో చిన్నమ్మకు ఉచ్చు బిగిస్తుంది.మరి ఈ ఆరోపణలు కూడా నిజమని తేలితే శశికళ మరిన్ని కష్టాల్లో పడినట్టే..