మార్కెట్లోకి శామ్‌సంగ్ జడ్1 ఫోన్... విశేషాలు

 

సెల్‌ఫోన్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం లాంటి సంస్థ శామ్‌సంగ్ మరో కొత్త ఫోన్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో టైజెన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఉపయోగించారు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న తొలి స్మార్ట్ ఫోన్ ఇదేనని శామ్‌సంగ్ సంస్థ సగర్వంగా ప్రకటించింది. ఈ ఫోన్ బుధవారం నాడు మార్కెట్లోకి విడుదలైంది. అన్నిటికంటే అనుకూలమైన అంశం ఏమిటంటే.. ఇది సామాన్యులకు అందుబాటులో వుంది. దీని ధర కేవలం 5 వేల 700 రూపాయలే. ఈ ఫోన్ వైట్, బ్లాక్, వైన్ రెడ్ రంగుల్లో లభిస్తుంది. 768 రామ్ వున్న ఈ ఫోన్‌లో 4 జీబీ ఇంటర్నల్ మెమరీ కూడా వుంది. యాంటీ వైరస్‌ కూడా ఇన్‌బిల్ట్‌గా వుంటుందని తెలుస్తోంది.