సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకం

 

బుధవారం సిఎం కార్యాలయంలో తెలంగాణా మంత్రులు శ్రీధర్ బాబు, సునితా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, డి.కె.అరుణ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ ను సడక్ బంద్ కు అనుమతి ఇవ్వాల్సిందిగా వారు కోరగా ముఖ్యమంత్రి సమాధానమిస్తూ సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా సడక్ బంద్ కు అనుమతి ఇవ్వలేమని, ఇలాంటి కార్యక్రమాలకు గతంలో సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా వెళ్ళలేమని, ఈ విషయంలో అందరి సలహాలు తీసుకుంటామని, మీడియా ఇచ్చే సూచనలు కూడా స్వీకరిస్తామని రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. సడక్ బంద్ కు అనుమతి లేదని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అది విరుద్ధమని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇందుకోసం 8వేలమంది పోలీసులను రంగంలోకి దింపామని, మహబూబ్ నగర్ జిల్లాలో 2700 మందిని బైండోవర్ చేశామని, కర్నూలు సరిహద్దు నుండి శంషాబాద్ వరకూ పోలీసు సిబ్బందిని మోహరించామని, ఈ ప్రాంతమంతా 30 పోలీసు యాక్టు అమల్లో ఉన్నాడని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. హైవే పైకి ఎవరూ ఆందోళన చేయడానికి రావద్దని, అలా వస్తే వారిని అదుపులోకి తీసుకుంటామని హైదరాబాద్ రేంజ్ డిఐజీ నాగిరెడ్డి అంటున్నారు.