కాంగ్రెస్ తో కలిస్తే తప్పేంటి..?

 

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకుంటున్నట్టు.. ఢిల్లీ వెళ్లిన ఆయన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుస్తారని వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆవార్తలపై స్పందించిన రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులు వేసేందుకే తాను ఢిల్లీ వెళ్లానని.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ‘గులాబీ కూలీ’ పేరుతో చందాల వసూలుపై ఢిల్లీలో కేసు వేస్తానని, కొన్నిరోజులుగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. పొత్తులు పెట్టుకునే అవకాశం ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. కేసీఆర్ వ్యతిరేకుల పునరేకీకరణలో కీలకపాత్ర వహిస్తానని, డిసెంబర్ 9 నుంచి పాదయాత్ర చేయాలనుకుంటున్నానని చెప్పారు.