శ్మశానంలో నిద్ర.... స్థలం వచ్చేనా...!

posted on: Sep 27, 2012 8:42AM

Grave Yards, Tirupathi, Padmavathi Puram, Laxmi Puram, Srinivasa Puram, Residents, MLA Bhumana Nagi Reddy,Sleep In Graveyard, Dharnas 

తిరుపతిలో పద్మావతీపురం, లక్ష్మీపురం, శ్రీనివాసపురం ప్రాంతవాసులకు సరైన శ్మశానం లేదు. ఈ ప్రాంతంలో దాదాపు 60వేలమంది నివసిస్తున్నారు. శ్మశానవాటికకోసం స్థలం కేటాయించాలంటూ తిరుపతి ఎం.ఎల్‌.. భూమాన కరుణాకరరెడ్డి ఓ రాత్రి శ్మశాననిద్ర చేపట్టారు. బతికుండగా బారెడు జాగా ఇవ్వలేని ప్రభుత్వం, చనిపోయాక శవాన్ని పూడ్చటానికి కూడా జానెడు స్థలం చూపడం లేదన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి మరిన్న ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ శ్మశానం నిద్రకుపక్రమించి నిరసన తెలపడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం రాజకీయనాయకుడంటే ఏమైనా చేయవచ్చు. ఏదైనా చేయించవచ్చు. అది ప్రజలకోసమైనా.. తనకోసమైనా... శ్శశానవాటికకు స్థలంకోసం భూమాన శ్మశాననిద్ర విజయవంతమై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆశిస్తున్నారు స్థానికులు.

google-ad-img
    Related Sigment News
    • Loading...