వివేకానంద రెడ్డి కన్నీటికి కారణమేంటి?

posted on: May 23, 2012 3:10PM

నేను బతికి ఉన్నంతకాలమూ కాంగ్రెస్ వాదిగానే మిగిలిపోతానన్న నాటి మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మాట తప్పారు. ఆయన కూడా ఆ కుటుంబవారసుడనిపించుకున్నారని విమర్శలకు అవకాశమిచ్చారు. ఎన్నికల్లో తన వదినగారు విజయమ్మపై గెలవలేక మంత్రి పదవిని చివరికి అన్నింటినీ వదులుకుని ఒంటరిగా మిగిలిపోయిన వైఎస్ వివేకానందరెడ్డి ఇప్పుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. తమ వారసుడు జగన్ తో కలిసి నడవబోతున్నారు. తన సోదరుడు వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన కుటుంబానికి దూరమయ్యానని, అయితే దుందుడు స్వభావం ఉన్న ఆయన తన అన్న వైఎస్ ను ఒక్కమాట అన్నందుకే శాసనసభ సాక్షిగా చేయిచేసుకున్నారు. ఇప్పుడు అందరూ రాజశేఖరరెడ్డిని విమర్శిస్తుంటే ఏమీ చేయలేక ఆయన జగన్ పంచన చేరుతున్నారు. చంద్రబాబు అవినీతి పరుడని గొంతెత్తి చాలా గట్టిగా అరిచిన వైఎస్ తన కుమారుడు సహాయంతో అక్రమంగా సంపాదించారన్న విమర్శ తనను ఎక్కువ బాధించిందని వివేకానందరెడ్డి సన్నిహితులతో అన్నారట. కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన తన అన్న రాజశేఖరరెడ్డిమరణానంతరం కూడగట్టుకున్న అపప్రద జీర్ణించుకోలేక పోతున్నానని వివేకా కన్నీరుపెట్టుకున్నారట. వదిన చేతిలో ఓటమి పాలైనందువల్లే తాను కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యానని గ్రహించిన ఆయన తననూ విమర్శకులు వదలరని ఎప్పుడో గుర్తించారు.

 

 

 

తన అన్న రాజశేఖరరెడ్డిని తిట్టినట్టే తననూ తేడితే మాత్రం తప్పేముందిలే అని ఆయన ఇప్పుడు అన్నింటికీ తెగించారు. దీంతో ఎటువంటి గడ్డుపస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధపడే జగన్ వెనుక నడుస్తానంటున్నారు. ఏదేమైనా కష్టం వచ్చినప్పుడు నిలబడే వాడే బంధువు అని నిరూపించుకునేందుకు వైఎస్ వివేకా నడుం కట్టారు. అన్ని పార్టీలు తనను కూడా టార్గెట్ చేసినా పర్వాలేదు కానీ, ఒక్క జగన్ తనను నమ్మితే చాలనుకుంటున్నానని వివేకా సన్నిహితుల ముందు ఆవేదన వ్యక్తం చేశారట. అయితే వివేకా పార్టీ మారటం భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి పదవి కోసం జగన్ ను లొంగదీసుకునేందుకూ వెనుకాడని వివేకా గెలిచి ఉంటే తన వైపు వచ్చి ఉండేవాడా అని అని జగన్ సన్నిహితులు అనుమానిస్తున్నారు. ఏమైనా బాబాయిలో వచ్చే మార్పు తమకు అనుకూలంగానే ఉంటుందని జగన్ వారికి సర్దిచేప్పారట. తనకు అందించిన నివేదికల ప్రకారం వివేకానందరెడ్డి తన సాన్నిహిత్యం కోరుకుంటున్నాడని జగన్ గ్రహించినట్టే ఉండి. అందుకే వివేకాకు వ్యతిరేకంగా కానీ, అనుకూలంగా కానీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. తన సిబిఐ హడావుడి ముగిసేంత వరకూ బాబాయి సాయం అందిస్తే ఆ తరువాత పార్టీని నడపటం నల్లేరుపై నడకలాంటిదని కూడా జగన్ అనుకుంటున్నారని తెలిసింది. వేరువేరు ఆలోచనలతో కలుస్తున్న ఈ బాబాయ్ - అబ్బాయ్ యవ్వారం ఎలా ఉంటుందో మాత్రం భవిష్యత్తులో తెరపైనే చూడాలని రాష్ట్రమంతా ఆసక్తిగా గమనిస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...