Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పరకాలలో కాంగ్రెస్ కు భంగపాటు తప్పదా?
posted on: May 22, 2012 1:37PM
పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఏర్పాటు చేసిన సిఎం బహిరంగసభ గాలిదుమారం కారణంగా అర్థాంతరంగా ఆగిపోయింది. ఇదీ ఒకందుకు మంచిదేనని, అసలు జనంలేని ఆ సభను చూసి మిగిలిన అభ్యర్థులు దుష్ప్రచారం చేయటానికి అవకాశమే లేకుండా పోయిందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు.
గట్టిగా జనాన్ని తీసుకురాలేని స్థితికి కాంగ్రెస్ చేరటానికి సురేఖ కార్యకర్తలను ఆకట్టుకోవటం ఒక కారణమైతే, తెలంగాణా ఉద్యమం ఈ ప్రాంతంలో బలంగా నాతుకుపోవడం మరో కారణంగా వారు తేలుస్తున్నారు. ఈ తెలంగాణా పేరుచెప్పి టి.ఆర్.ఎస్. ఒక పక్క మరోపక్క కార్యకర్తలను ఆకర్షిస్తున్నాయి. ఇక ఉన్నది పెరగకపోయినా తన క్యాడర్ ను అలానే కాపాడుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఇక్కడ శ్రమపడింది. ఈ శ్రమ ఫలితంగా ఆ పార్టీ కొత్తగా పెరగకపోయినా గతంలో ఉన్న ఓట్లను తిరిగి సంపాదించుకోగలమనే ధీమాతో ఉంది.
మొత్తమ్మీద వై.ఎస్.ఆర్. కాంగ్రెస్, టిడిపి, టి.ఆర్.ఎస్., బిజెపి ప్రధానంగా ఈ నియోజకవర్గంలోని ఓట్లను చీలుస్తాయి. ఆ నాలుగు పార్టీలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోటీలో ఉన్నందున గెలిచే అభ్యర్థికి వచ్చేది తక్కువ మెజారిటీనే అన్నది అర్థమవుతోంది. కానీ, ఆ నాలుగు పార్టీలు పోటీలో ఉండటం వల్ల కాంగ్రెస్ నాయకులు తమ కార్యకర్తలను తిప్పుకోవటమే ఇక్కడ ఇబ్బందికరంగా మారిందని ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు సిఎం దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. దీంతో ఈ ఒక్క స్థానాన్ని వదులుకుని మిగిలిన సీమాంధ్రపై ఎక్కువ ద్రుశితి పెట్టాలని నాయకులు నిర్ణయించుకున్నారనీ తెలుస్తోంది. ఏమైనా ఇటీవల కాలంలో సిఎం సీమాంధ్ర వైపు మొగ్గినందున అక్కడేమి ప్రసంగిస్తారన్న అంశంపై ఎదురుచూసిన వారికి మాత్రం నిరాశే మిగిలింది. అందుకనే సిఎం తిరిగి బయలుదేరేటప్పుడు వరంగల్ లో పాత్రికేయులతో మాట్లాడుతూ బిజెపి, టి.ఆర్.ఎస్., జగన్ లపై నిప్పులు చెరిగారు.



.jpeg)


