అది నాగం దిగజారుడుతనానికి నిదర్శనం

posted on: Jan 26, 2012 2:12PM

హైదరాబాద్: తెలంగాణ కోసం కాకుండా ఓట్ల కోసం కెసిఆర్‌ను కలవడం మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు.ఆయన కెసిఆర్‌ను తనకు మద్దతివ్వాలని కోరారు కానీ తెలంగాణ సాధన కోసం కాదన్నారు. కేవలం ఓట్ల కోసం మాత్రమే కలవడం ఎంత వరకు సమంజసమన్నారు. నాగం తీరుకు ఆయన నియోజకవర్గం ప్రజలే ఆయనకు ఉప ఎన్నికల్లో బుద్ధి చెబుతారన్నారు.కెసిఆర్ ను గతంలో పలుమార్లు తెలంగాణ ద్రోహిగా వర్ణించిన నాగం ఇప్పుడు ఎలా కలిసి మద్దతు కోరారన్నారు. కెసిఆర్ చేసిన తప్పులను ఇప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...