కేసీఆర్, వాజ్ పేయి అంతిమ సంస్కారాలకు ఎందుకు వెళ్లలేదు?

 

మాజీ ప్రధాని వాజ్‌పేయి మరణం పట్ల ప్రపంచవ్యాప్తంగా పలువురు విచారం వ్యక్తం చేసారు.. ఆయన మరణవార్త విని దేశం నలుమూలల నుండే కాదు, విదేశాల నుండి కూడా ప్రముఖులు ఢిల్లీ వచ్చి నివాళులు అర్పించారు.. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం వాజ్ పేయి అంతిమ సంస్కారాలకు హాజరుకాలేదు.. వాజ్ పేయి మరణ వార్త అనంతరం.. శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాలకు, స్కూళ్లకు సెలవు ప్రకటించారు.. వాజ్ పేయి మీద తనకున్న ప్రేమాభిమానాల్ని, గౌరవాన్ని సంతాప సందేశాల రూపంలో ప్రకటించారు.. ఇంతవరకు బాగానే ఉంది కానీ కేసీఆర్ అసలు ఢిల్లీకి వెళ్లి ఎందుకు నివాళులు అర్పించలేదంటూ చర్చలు మొదలయ్యాయి.. అయితే తెరాస శ్రేణులు మాత్రం.. కేసీఆర్ సోదరి దశదిన కర్మలు ఉండటంతోనే ఆయన ఢిల్లీకి వెళ్లలేదని చెప్తున్నారు.. కానీ కొందరి అభిప్రాయం మాత్రం వేరేలా ఉంది.. కేసీఆర్ సోదరి దశదిన కర్మ కార్యక్రమం అనంతరం సాయంకాలం అయినా ఢిల్లీకి వెళ్లి మహానేతకు నివాళులర్పిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.