బాబు ముఖ్య అనుచరుడికి బీజేపీ నేత ఫోన్.. మైండ్ బ్లాక్ అయ్యే ఆన్సర్

 

బీజేపీ ఉత్తర భారత దేశానికి చెందిన పార్టీగా పేరు పడి పోయిన నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు దక్షిణ భారత దేశంలో బలపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో నాలుగు స్థానాలు గెలుచుకున్న జోష్ లో మరింతగా బలపడేందుకు గాను ఇతర పార్టీల నేతలను చేర్చుకునే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీ ముఖ్య నేత ఒకరు టీటీడీపీ నేత, బాబుకు అత్యంత సన్నిహితుడు ఐన రావుల చంద్రశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి ఇంకా టీడీపీ లో ఏముంది. మా పార్టీదే భవిష్యత్తు.. మా పార్టీలోకి వస్తే మీ భవిష్యత్తు కూడా బావుంటుందని చెప్పగా దానికి రావుల సమాధానం తో ఆ బీజేపీ నేత సైలెంట్ అయినట్లు సమాచారం. ఇంతకూ రావుల సమాధానం ఏమిటంటే "తెలంగాణాలో మాకు ఎమ్మెల్యేలు లేరు సరే.. మీకు మాత్రం ఉన్నది ఒక్కరేగా.. దీనిలో పెద్ద తేడా ఏముందని" అనడంతో ఆ బీజేపీ నేత సరే మీ ఇష్టం అంటూ సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. ఎంతో మంది టీటీడీపీ నేతలు పార్టీ వీడినా రావుల మాత్రం అధినేత బాబుతో ఉన్న అనుబంధం వల్లే పార్టీని వీడలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.