దివిసీమ బాగు కోసమే రాజకీయాల్లోకి: కంఠంనేని రవిశంకర్

 

 

 

దివిసీమని ఎన్నో సమస్యలు చుట్టుముట్టి వున్నాయి. దివిసీమ ప్రజలు కనీసం తాగటానికి మంచినీరు కూడా లేక బాధపడుతున్నారు. ఇప్పుడు తాగే నీరు కూడా విషంగా మారిపోయి రోగాల బారిన పడుతున్నారు. నీటి సమస్యే కాకుండా ఎన్నో సమస్యలు దివిసీమ ప్రజల్ని బాధపెడుతున్నాయి. ఎన్నికలప్పుడే కనిపించే నాయకుల చేతిలో ఇక్కడి ప్రజలు మోసపోయారు. ఇక్కడి ప్రజల బాగోగుల గురించి పట్టించుకునే నాయకుడే లేకుండా పోయారు. అందుకే తన ప్రాంతాన్ని తానే బాగు చేసుకునే ఉద్దేశంతో రాజకీయ రంగప్రవేశం చేశానని కంఠంనేని రవిశంకర్ అంటున్నారు. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్న కంఠమనేని రవిశంకర్ ఇప్పటికే తన ప్రాంతం బాగుకోసం ఎన్నో పనులు చేశారు. దివిసీమ ఎదుర్కొంటున్న సమస్యల మీద, వాటి పరిష్కార మార్గాల మీద పూర్తి అవగాహన వున్న తనకు అధికారం లభిస్తే దివిసీమను బాగుచేసుకుంటానని ఆయన చెబుతున్నారు. ఈ ప్రాంత ప్రజలు తనను ఎంతో ప్రేమిస్తారని, తాను తనకోసం అధికారం కోరుకోవడం లేదని.. తన ప్రాంతం బాగు కోసం, తన ప్రాంత ప్రజల అభ్యున్నతి కోసమే అధికారం కోరుకుంటున్నానని వివరిస్తున్నారు.