రామోజీకి బీజేపీ ఆఫర్ ఇదే..!!
posted on Jul 16, 2018 4:32PM
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షా, రామోజీరావుతో భేటీ అవడం హాట్ టాపిక్ గా మారింది.. అయితే ఇప్పుడు బయటికొచ్చిన ఓ న్యూస్ ఆ టాపిక్ కి ఇంకాస్త హీట్ పెంచుతుంది.. అమిత్ షా, రామోజీని 'సంపర్క్ ఫర్ సమర్థన్' లో భాగంగానే కలిసారని బీజేపీ నేతలు చెప్పినప్పటికీ వారిద్దరి మధ్య రాజకీయ చర్చ జరుగుతుందని అందరూ ఊహించారు.. అయితే ఆ ఊహలు నిజమైనట్టు తెలుస్తోంది.
అమిత్ షా ప్రస్తుత రాజకీయాల గురించి రామోజీతో చర్చించారట.. ముఖ్యంగా తెలంగాణ, ఏపీ రాజకీయాల గురించి చర్చించినట్టు సమాచారం.. అలానే రామోజీని వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజెపికి మద్దతు తెలపాల్సిందిగా అమిత్ షా కోరినట్టు తెలుస్తోంది.. అదే విధంగా అమిత్ షా, రామోజీకి ఓ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారట.. కేంద్రం ప్రతిపాదించబోయే రాజ్యసభ సభ్యులలో రామోజీరావుకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని అమీత్ షా స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.. అయితే రామోజీ ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం.. మొత్తానికి బీజేపీ, తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడానికి బాగానే పావులు కడుపుతుందిగా అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.