‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చంద్రబాబు ఏమన్నారంటే...?

 

రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ పై జరగాల్సిన రచ్చ మొత్తం జరిగిపోయింది. రామ్ గోపాల్ వర్మకు, టీడీపీ నేతలకు, ఆయన అభిమానులకు మధ్య మాటల యుద్దం జరిగింది... జరుగుతూనే ఉంది. అయితే దీనిపై ఇప్పటికే అందరూ స్పందించారు కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం స్పందించారు. అయితే తొలిసారి ఆయన ఈ సినిమా స్పందించారు. అమరావతిలోని తన నివాసంలో పార్టీ సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో  ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ పేరుతో రామ్‌గోపాల్‌వర్మ సినిమా తెరకెక్కిస్తున్న విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట. దీంతో ఆ సినిమాపై స్పందించిన ఆయన... ఎన్టీఆర్‌ జీవిత చరిత్రపై వాస్తవాలకు విరుద్ధంగా ఎవరు సినిమా తీసినా ప్రజలు ఆమోదించరని... ఎన్టీఆర్‌ ఎవరో, ఆయన జీవితంలో జరిగిన పరిణామాలేమిటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని... సినిమాపై తెదేపా నేతలెవరూ ఇష్టానుసారంగా మాట్లాడొద్దని సూచించారు. ప్రజామోదం లేని సినిమాల పట్ల అంతగా ఆవేశపడాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారట. మరి చంద్రబాబు వ్యాఖ్యలపై వర్మ స్పందిస్తాడో..?లేదో..? చూద్దాం...