రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

 

 

 

రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 55 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 7న పోలింగ్ జరుగనుంది. నేటి నుంచి ఈనెల 28 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. మన రాష్ట్రంలో మొత్తం6 స్థానాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. శాసనసభ బలాబలాలను చూస్తే.. రాష్ట్రంలో ఉన్న ఆరు ఖాళీలకు మూడు కాంగ్రెస్‌కు, రెండు టిడిపికి దక్కడం ఖాయం. మిగిలిన ఒక స్థానం కోసం వైకాపా, టీఆర్ఎస్ పార్టీలు ఉమ్మడి అభ్యర్ధిని ఎన్నుకోనున్నట్లు సమాచారం. దీనిపై రెండు పార్టీల మధ్య రహస్య మంతనాలు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.