శ్వేతా బసు ప్రసాద్: మీడియా తీరుపై రాజమౌళి ఆగ్రహం

 

సినీ నటి శ్వేతాబసు ప్రసాద్ ఉదంతంపై దర్శకుడు రాజమౌళి మీడియా మీద, ప్రజల మీద ప్రశ్నలను ట్విట్టర్లో సంధించారు. శ్వేతాబసు వ్యవహారంలో పట్టుబడిన వ్యాపారవేత్తకు ఎలాంటి శిక్ష పడింది? అతని గురించి మీడియా ఎందుకు పట్టించుకోలేదు? అతని నిజ స్వరూపాన్ని అతని తల్లి, భార్య, అక్క, చెల్లెళ్లు, కూతురు, స్నేహితుల ముందు ఎందుకు పెట్టలేదు? పునరావాస కేంద్రంలో తనలాంటి మహిళలకు పలు విషయాలపై అవగాహన కల్పిస్తున్న విషయాన్ని మీడియా దృష్టి ఎందుకు పెట్టడం లేదు?మీడియాలో కథనాలు చూసిన శ్వేత బసు ఏదయినా అఘాయిత్యానికి పాల్పడితే దానికి బాధ్యులెవరు? సున్నితమైన విషయాన్ని ఎందుకు బజారుకీడ్చారు? మీడియా శ్వేతాబసు విషయంలో అనుసరిస్తున్న వైఖరికి ఎవరివద్దయినా సమాధానం ఉందా అంటూ రాజమౌళి ప్రశ్నించారు.