అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా: రాహుల్ గాంధీ

 

అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేసారు.. కర్నూల్ పర్యటనలో భాగంగా బైరెడ్డి కన్వెన్షన్ సెంటర్లో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని చెప్పారు.. కేంద్రం నుంచి ఏపీకి ప్రత్యేక సాయం అందాలన్నారు.. అదే విధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.. మరోవైపు బహిరంగ సభలో కూడా రాహుల్ ప్రత్యేకహోదా గురించి మాట్లాడారు.. మోదీలా తాను అబద్దాలు చెప్పడానికి రాలేదన్నారు.. హోదా విషయంలో తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే ఏపీలో అడుగుపెట్టనని రాహుల్ ప్రకటించారు.. 2019లో అధికారంలోకి రాగానే ఏపీకి ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తామని భరోసా ఇచ్చారు.. ప్రత్యేక హోదా అమలుపైనే తన తొలి సంతకం ఉంటుందన్నారు.. అయినా ప్రత్యేక హోదా అనేది కేంద్రం ఏపీకి ఇచ్చే కానుకేం కాదని, అది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అని అన్నారు.