బీజేపీ పంజరాన్ని తయారు చేస్తుంది..!!

 

రీసెంట్ గా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ..  ప్రజల హక్కులను కాలరాస్తూ, దేశాన్ని పంజరంలో బంధించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ మరియు అమిత్ షా మీద విమర్శలు చేసారు.. ‘బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తన ప్రసంగంలో భారత్‌ను బంగారు పక్షి అంటూ చెబుతారు.. దేశం బంగారు పక్షి అయితే దాని కోసం ఓ పంజరాన్ని తయారు చేయాలి.. ఇవాళ వాళ్లు పంజరం తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.. దాన్ని అడ్డుకునేందుకు మేము ప్రయత్నిస్తున్నాం’ అని అన్నారు.. భారత దేశం భిన్న సంస్కృతులకు నిలయమనీ, దాన్నీ బీజేపీ పక్షిలా చూస్తుంటే తాము మాత్రం అందరినీ కలుపుకుని పోయే గంగానదిలా చూస్తున్నామన్నారు.. విమర్శలతో పాటు రాహుల్, అమిత్ షా మీద ఛలోక్తులు కూడా విసిరారు.. ప్రజల హక్కులను కాలరాస్తున్నారంటూ రాహుల్ బీజేపీ మీద విమర్శలు చేస్తుండగా, ఉన్నట్టుండి పెద్ద శబ్దంతో మైక్ ఆగిపోయింది.. దీంతో తన మైకును అమిత్‌షా ఆపేసి ఉంటారని రాహుల్ సరదాగా పేర్కొనడంతో అక్కడున్నవారంతా నవ్వారు.