వైరల్ గా మారిన రాహుల్ ట్వీట్..


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై, బీజేపీ పై సెటైర్లు వేయడం కామనే. ఈ నేపథ్యంలోనే బీజేపీపై ఆయన బీజేపీపై చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.  'జన వేదన సమ్మేళన్' జరిగిన సమయంలో రాహుల్ మాట్లాడుతూ, తమ ఎన్నికల గుర్తు దేవుళ్లలో, ఆథ్యాత్మిక గురువుల్లో కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హస్తం గుర్తును తొలగించాలని ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో కాంగ్రెస్ ఎన్నికల గుర్తు 'హస్తం'పై బీజేపీ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడంపై రాహుల్ గాంధీ స్పందిస్తూ... "డియర్ బీజేపీ డరో మత్" (ప్రియమైన బీజేపీ భయపడవద్దు) అని బీజేపీ ని కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆయన పెట్టిన ట్వీట్ వందలాది మంది షేర్ చేసుకుంటున్నారు.