రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీఆర్కే మృతి

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, టీటీడీ మాజీ ఈవో, రచయిత పీవీఆర్కే ప్రసాద్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ తెల్లవారుజామున గుండెపోటుకు గురవ్వడంతో తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన వివిధ హోదాల్లో సేవలందించారు. మాజీ ప్రధాని పీవీ వ్యక్తిగత సలహాదారుగా పనిచేశారు..టీటీడీ ఈవోగా ఉన్న సమయంలో తిరుమల ప్రాశస్త్యంపై పలు పుస్తకాలు రాశారు. బాబ్రీ మసీదు కూల్చివేత, ఆర్థికమంత్రిగా మన్మోహన్ సింగ్ రాజీనామా తదితర విషయాలను వివరిస్తూ అసలేం జరిగిందంటే పేరిట ఓ పుస్తకం రాశారు. పీవీఆర్కే మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు సంతాపం తెలిపారు. ప్రసాద్ అంత్యక్రియలు ఇవాళ పంజాగుట్ట శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు.